23-11-2025 06:10:21 PM
గొర్రెల కాపరి గల్లంతు..
కామారెడ్డి రైల్వే ట్రాక్ సమీపంలో ఘటన..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని సరంపల్లి శివారులో రైల్వే ట్రాక్ వద్ద ఆదివారం ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 90 గొర్రెలు మృతిచెందాయి. రైలు రాకను గమనించి వాటిని కాపాడుకునే ప్రయత్నంలో గొర్రెల కాపరి దేవునిపల్లి గ్రామానికి చెందిన సురేష్ పెద్ద వాగులోకి దూకారు. అయితే ఆయనతో పాటు ఉన్న మరొక దర్శనపు సుధాకర్ ఈత రాకపోవడంతో వాగులో గల్లంతు అయ్యారు. సుధాకర్ అచూకీ ఇంకా లభ్యం కాలేదని రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. పోలీసులు, రిస్క్ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రైల్వే ట్రాక్ పైనుంచి గొర్రెల మందను దాటిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.