15 April, 2026 | 1:49 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి..

23-11-2025 06:29 PM

హైదరాబాద్: భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ నలుమూలల నుండి ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ కోసం మీర్‌ఖాన్‌పేట్‌లో జరుగుతున్న ఏర్పాట్లను సీఎం రేవంత్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు.

వివిధ దేశాల రాయబారులు, ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని, సమ్మిట్‌లో పాల్గొనే ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. పాస్‌లు లేని వారిని, సమ్మిట్‌తో సంబంధం లేని వ్యక్తులను ప్రాంగణంలోకి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. శాఖల వారిగా నియమించబడిన అధికారులను మాత్రమే లోపలికి అనుమతించాలని.. పార్కింగ్, భద్రతా ఏర్పాట్లలో పాల్గొన్న పోలీసులకు ఎటువంటి సమస్యలు తలెత్తకూడదని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పనులను కూడా సీఎం రేవంత్ పరిశీలించారు.