calender_icon.png 30 May, 2025 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్కల దాడిలో 40 గొర్రెల మృత్యువాత

29-05-2025 03:03:55 AM

-భాధిత కుటుంబాన్ని పరామర్శించిన 

-మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్  అందెల శ్రీరాములు యాదవ్

మహేశ్వరం, మే 28: వీదికుక్కల దాడిలో 40కి పైగ గొర్రెలు మృత్యువాత పడడం అత్యంత బాధాకరమైన విషయమని బిజెపి రాష్ర్ట కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలోని దయ్యాల గుండుతండాకి చెందిన రామవత్ డాక్య నాయక్ వృత్తిరీత్యా గొర్లను మేపుకుంటూ జీవనోపాధి కొనసాగించేవారు. మంగళవారం రాత్రి షెడ్డులో ఉన్న  గొర్రెలను వీధి కుక్కలు దాడి చేయడంతో 40కి పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఇట్టి విషయం పార్టీ నేతలు అందెల శ్రీరాములు యాదవ్  దృష్టికి తీసుకువచ్చారు. 

బుధవారం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ,జిహెఎంసి అధికారులు వీధికుక్కలను తీసుకువచ్చి గ్రామాల పరిసర ప్రాంతాల్లో వదిలిపెడుతుంటే గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.

వీధి కుక్కలు గొర్రెలపై దాడి చేశాయని,అదే వారి పిల్లలపై దాడి చేస్తే పరిస్థితి ఏంటని ఆయన అధికారులను నిలదీశారు. గ్రామాలలో వీధి కుక్కల సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.అనంతరం డాక్యనాయక్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.

కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు యాదీష్,కిసాన్ మోర్చా జాతీయ నాయకులు పాపయ్య గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి మిద్దె సుదర్శన్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ సభ్యులు సుదర్శన్ యాదవ్, బిజెవైఎం మండల అధ్యక్షుడు వణంపల్లి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.