29-05-2025 03:11:59 AM
- నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలి
- స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాల్సిందే
- ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో మీనాక్షినటరాజన్ సమీక్ష
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూనే..నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు, గ్రూప్ తగాదాలను చక్కది ద్దేపనిలో నిమగ్నమైంది.
పార్టీలోని పాత, కొత్త నేతల మధ్య నెలకొన్న పంచాయితీలు, సమస్యలను పరిష్కరించి..వారి మధ్య సఖ్యతను పెంచేందుకు హస్తం పార్టీ ముందుకె ళ్తోంది. ఈమేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
బుధవారం హైదరాబాద్లోని హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని (పెద్దప ల్లి, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్, జహీరాబాద్, మల్కాజ్గిరి ) ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జులతో సమావేశమయ్యారు.
ఆయా నియోజకవర్గాల పరిధిలో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలు, ఎంపీ లతో విడివిడిగా సమావేశమయ్యారు. ప్రభు త్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మీనాక్షి సూచించారు.
జహీరాబాద్ పార్లమెంట్ పరిస్థితుల గురించి మంత్రి దామో దర రాజనర్సింహాను అడిగి తెలుసుకున్నా రు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కూడా మీనాక్షి నటరాజన్తో భేటీఅయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు వివరించినట్లు సమాచారం. గురువారం కూడా మరికొన్ని పార్ల మెంట్ నియోజకవర్గాల్లోని పార్టీ నేతలు సమావేశం కానున్నారు.
మాకు మంత్రి పదవులు ఇవ్వండి: ఎమ్మెల్యేలు
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పార్టీ నాయకుల మధ్య నెలకొన్న సమస్యలను మీనాక్షినటరాజన్ తెలుసుకున్నారు. సరస్వతీ పుష్కరాలకు సంబంధించి ప్రొటోకాల్ వివాదంతో పాటు పలు అంశాల్లో తాము వివక్షకు గురవుతున్నామని ఎమ్మెల్యే గడ్డం వంశీ.. మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు.
దీంతోపా టు తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఎమ్మెల్యేలు రాజ్ఠాకూర్, వివేక్ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఎంబీసీ సామాజికవర్గానికి చెందిన తాను 30ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నానని తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లేదా మంత్రి ఇవ్వాలని రామగుండం ఎమ్మె ల్యే రాజ్ఠాకర్ విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాలని మీనాక్షిని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను మీనాక్షికి చెప్పాల్సింది చెప్పా నని పేర్కొన్నారు. తాను ఎవరి వద్ద లొంగి మాట్లాడనని ఆయన చెప్పారు. సీఎం దగ్గర కూడా చెప్పాల్సిన అంశాలు చెప్పి వెళ్లిపోతానన్నారు.
ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వండి: కంది శ్రీనివాస్రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలని ఆ పార్టీ సీనియర్ నేత కంది శ్రీనివాస్రెడ్డి పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షినటరాజన్కు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఆదిలాబాద్లో పార్టీ ఎందుకు వెనుకంజలో ఉందని, పార్టీ పటిష్టతకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారన్న అంశాల గురించి కంది శ్రీనివాస్ను అడిగి మీనాక్షి తెలుసుకున్నారు.
మీనాక్షిని కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు
మీనాక్షినటరాజన్ను పార్టీకి చెందిన మాదిగ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్, లక్ష్మీకాంతారావు, యాదయ్య కలిసి తమ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈవిషయాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తానని మీనాక్షి వారికి హామీ ఇచ్చారు. మాదిగ సామాజికవర్గానికి మంత్రి పదవి వచ్చాక 25లక్షల మందితో భారీ సభను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రితో మరోసారి మాదిగ ఎమ్మెల్యేల భేటీ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని బుధవారం మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలు మరోసారి కలిశారు. ఇప్పటికే పలుమార్లు కలిసినప్పటికీ.. మీనాక్షితో భేటీ అనంతరం సీఎంతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. మంత్రి పదవులు ఇవ్వడం అనేది తన చేతిలో లేదని, పార్టీపెద్దల సూచనల మేరకు నిర్ణయం ఉంటుందని ఎమ్మెల్యేలకు సీఎం చెప్పినట్లు సమాచారం.
న్యాయం చేయాలి: జగ్గారెడ్డి
తన నియోజకవర్గానికి సంబంధించి పలు అంశాలను జగ్గారెడ్డి మీనాక్షితో చర్చించారు. కార్యకర్తలకు పదవుల్లో న్యాయం చేయాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.