calender_icon.png 24 November, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి

24-11-2025 01:15:54 AM

-వాగులో దూకిన గొర్రెల కాపర్లు.. ఒకరు గల్లంతు

-రిస్క్ టీం గాలింపుతో మృతదేహం లభ్యం

-కామారెడ్డి రైల్వే ట్రాక్ సమీపంలో ఘటన

కామారెడ్డి, నవంబర్ 23 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని సరంపల్లి శివారులో రైల్వే ట్రాక్ వద్ద ఆదివారం ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి చెందాయి. రైల్వే ట్రాక్‌పై నుంచి గొర్రెల మందను దాటిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

రైలు రాకను గమనించి, వాటిని కాపాడుకునే ప్రయత్నంలో గొర్రెల కాపరి దేవునిపల్లి గ్రామానికి చెందిన సురేష్, ఆయనతోపాటు ఉన్న మరోకాపరి దర్శనపు సుధాకర్ పెద్ద వాగులోకి దూకారు. అయితే దర్శనపు సుధాకర్‌కు ఈత రాకపోవడంతో వాగులో గల్లంతు అయ్యాడు.

గల్లంతైన గొర్రెల కాపరి దర్శనం సుధాకర్ మృతదేహం ఆదివారం రాత్రి లభించిందని రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. మృతుడు సుధాకర్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుం బానికి ఆసరాగా ఉన్న సుధాకర్ మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో దేవునిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.