22 May, 2026 | 11:45 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

ఆస్తి పన్ను చెల్లించని దుకాణాలు సీజ్..

23-03-2026 11:41 AM

మొండి బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తాం

మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక 

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో(Tandur Municipal Limits) ఏండ్ల తరబడి ఆస్తిపన్ను చెల్లించని దుకాణాలను మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తాళాలు వేశారు. శ్రీ పోట్లీ మహారాజ్ దేవాలయం ప్రాంగణంలో ఉన్న దుకాణ సముదాయం నిర్వాహకులు ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో సోమవారం తాళాలు వేసి సీజ్ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మధుసూదన్ రెడ్డి(Commissioner Madhusudan Reddy) మాట్లాడుతూ ఆస్తి పన్ను మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేశామని అయినా కూడా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రైవేటు ప్రాపర్టీలకు సంబంధించి మొండి బకాయి ఉన్నవారికి రెడ్ నోటీసులు అందిస్తూ కట్టకపోతే ఇకముందు ఆస్తులు జప్తు చేసుకుంటామని హెచ్చరించారు. పన్నులు చెల్లించకపోతే పట్టణానికి రావలసిన గ్రాండ్స్ గ నిలిచిపోయే అవకాశం ఉందని వివరించారు. పట్టణ ప్రజలు టాక్స్ లు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కమిషనర్ వెంట మేనేజర్ నరేందర్ రెడ్డి, సిబ్బంది రాములు,  నాగేందర్, కపిల్, గోపాల్,  ఉమేష్,జవాన్లుతదితరులు ఉన్నారు.