01-09-2024 12:00:00 AM
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వరం ప్రకటించారు. మూడు వందల రూపాయలకే ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ కనెక్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇది ముఖ్యంగా యువతకు, మహిళలకు ఎంతగానో ఉపయోగడుతుంది. విద్యార్థులకు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ప్రైవేటు కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లు ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తున్నా రు. ఇది దానికి విరుగుడుగా మారుతుంది. అయితే దీనికి ప్రభుత్వ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సహకారం తీసుకుంటే బాగుంటుం ది. ప్రైవేటు కంపెనీల దూకుడు, బాదుడునుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. అలాగే దేశీయ ప్రభుత్వ సంస్థ అభివృద్ధి సైతం జరుగుతుంది.
శ్రిష్ఠి శేషగిరి, సికిందరాబాద్