శ్రీదేవి క్రియేషన్స్, విన్విత ఎంటర్టైన్మెంట్స్ సంస్థల నుండి రానున్న చిత్రం ‘పడమటి కొండ ల్లో‘. నరేష్ పెంట దర్శకత్వం వహిస్తూ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి జయకృష్ణ దురుగడ్డ నిర్మాత. ఈ సినిమాలోని హీరో ఫస్ట్లుక్ను ఇటీవల సాయిధరమ్ తేజ్ విడుదల చేయగా, తాజాగా మే డే సందర్భంగా హీరోయిన్ శ్రావ్య రెడ్డి లుక్ని విడుదల చేసింది చిత్ర బృందం. ఎర్ర రంగు చీరలో జుట్టు విరబోసుకుని చేతిలో కత్తితో కాళీమాతలా కనపడుతోన్న శ్రావ్య ఈ సినిమాలో మైన అనే పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని తెలిపిన నిర్మాత, మరిన్ని వివరాలతో ప్రేక్షకుల ముందుకు వస్తామన్నారు.