25-06-2025 12:51:16 PM
న్యూఢిల్లీ: అనేక వాయిదాల తర్వాత, క్రూ డ్రాగన్ క్యాప్సూల్, భారతదేశానికి చెందిన శుభాన్షు శుక్లాతో(Shubhanshu Shukla) సహా నలుగురు వ్యోమగాములతో కూడిన స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 అంతరిక్ష నౌక బుధవారం నాడు నింగిలోకి ఎగిరింది. ఆక్సియం మిషన్ 4, లేదా యాక్స్-4, ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుండి తెల్లవారుజామున 2:31 గంటలకు (GMT ఉదయం 6:31 గంటలకు) ప్రయోగించనుంది. భారతదేశానికి చెందిన శుభాంషు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి ఒక అమెరికన్ వాణిజ్య మిషన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణిస్తున్నారు.
40 సంవత్సరాల విరామం తర్వాత రెండవ 'గగన్యాత్రి'ని అంతరిక్షంలోకి పంపాలనే 1.4 బిలియన్ల భారతీయుల కలలను మోసుకెళ్తున్నారు. 1984లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ చరిత్ర సృష్టించిన నాలుగు దశాబ్దాల తర్వాత, మిషన్ పైలట్ అయిన శుక్లా, అంతరిక్షంలోకి వెళ్లే భారతదేశపు రెండవ వ్యోమగామి. ఈ చారిత్రాత్మక విమానానికి 39 ఏళ్ల ఫైటర్ పైలట్ను ఇస్రో ప్రధాన వ్యోమగామిగా ఎంపిక చేసింది. రేపు సాయంత్రం 4.30 గంటలకు అంతరిక్ష కేంద్రంతో డ్రాగన్ వ్యోమనౌక డాకింగ్ ప్రక్రియ ఉంటుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకునేందుకు 28 గంటల సమయం పడుతోంది. 14 రోజుల పాటు శుభాంశు శుక్లా ఐఎస్ఎస్లో గడపనున్నారు. శుభాంశు శుక్లా రోదసీయాత్ర కోసం భారత్ రూ.550 కోట్లు ఖర్చు చేసింది. యాక్సియం-4 మిషన్కు శుభాంశు శుక్లా పైలట్గా వ్యవహరిస్తున్నారు.