24-06-2025 12:00:00 AM
నల్లగొండ టౌన్, జూన్ 23 : డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నిర్భయమైన పోరాటం దేశాన్ని ఒకతాటిపై నిలబెట్టే విధంగా మార్గదర్శకం అయ్యిందని, నేటి తరానికి ఆయనే స్ఫూర్తి అని బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా సోమవారం జిల్లా బిజెపి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజు యాదవ్, దర్శనం వేణు, తదితరులు పాల్గొన్నారు.