7 April, 2026 | 11:16 AM

Breaking News

బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •   రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం... తగలబడిన బట్టల షాపు   •   కూల్ బీరు అడిగిండని కాళీ సీసతో వ్యక్తిపై దాడి.!   •   జలాశయాలు డెడ్ స్టోరేజ్ : తాగునీటికీ కటకట!   •  

లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్‌ఐ

11-02-2026 03:27 AM
  1. మాదాపూర్  పోలీస్ స్టేషన్లో ఏసీబీ వల
  2. కేసులో సహాయం పేరుతో రూ.50 వేల డిమాండ్

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): చీటింగ్ కేసులో సహాయం చేస్తానని చెప్పి లంచం తీసుకుంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్‌ఐ వినయ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కా డు. బాధితుడి నుంచి రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు వలపన్ని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక కేసులో తన సహకారం అందిస్తానని చెప్పిన ఎస్‌ఐ విన య్ ఇందుకు ప్రతిఫలంగా రూ. 50,000 ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.

పెద్ద మొత్తం ఇవ్వలేనని బాధితుడు చెప్పి నా డిమాండ్ చేడయండంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన అధికారులు ప్రాథమిక విచారణ అనంతరం వలపన్నే చర్యలు చేపట్టారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఫిర్యాదుదారుడిని లంచం డబ్బులతో ఎస్‌ఐ వద్దకు పం పించగా, నగదు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి వినయ్‌ను పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకుని విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి తరలించారు.