calender_icon.png 29 November, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్‌ఐ యుగంధర్ గౌడ్

29-11-2025 12:23:44 AM

వలిగొండ, నవంబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా వలిగొండ మండలంలో ఈనెల 30 నుండి రెండవ విడత ప్రారంభం కానుంది. అందులో భాగంగా శుక్రవారం వలిగొండ ఎస్సు యుగంధర్ గౌడ్ మండలంలోని అరూర్, వేములకొండ, చిత్తాపురం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందికి తెలియజేయడం జరిగింది.