02-06-2025 12:20:55 AM
సిద్దిపేట, జూన్ 1 (విజయక్రాంతి): బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటి మహనీయులు చూపిన బాటలో నడుస్తూ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని బాబు జగ్జీవన్ రామ్ భవన్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర మహేందర్, ఉపాధ్యక్షుడు దబ్బేట శ్రీనివాస్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రావు భవన్ పాలకవర్గం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో అధ్యక్షునిగా ఎర్ర మహేందర్ గెలుపొందారు.
ఈ సందర్భంగా పాలకవర్గం సభ్యులు జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రాం, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. తమపై నమ్మకం ఉంచి పాలకవర్గ సభ్యులుగా ఎన్నుకున్నందుకు జిల్లా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మిగతా సంఘాలకు దీటుగా బాబు జగ్జీవన్ రామ్ సంఘాన్ని అభివృద్ధి పరుస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట బీజేఆర్ సంఘ సభ్యులు.. మాదిగ కులసంఘాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు..