14 April, 2026 | 5:12 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

ఒక్కరోజే రూ.11 వేలు పెరిగిన వెండి

18-12-2025 01:07 AM

కిలో రూ.2.20 లక్షలు దాటిన ధర

హైదరాబాద్, డిసెంబర్ 17: అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. సామాన్యులకు అందనంత ఎత్తులో పసిడి, వెండి ధరలు ఉన్నాయి. ముఖ్యంగా వెండి ధరలు కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే వెండి కిలో రూ.11 వేలు పెరిగింది. అలాగే బంగారం కూడా రూ.650 పెరిగి రూ.1,34,510కి చేరుకుంది. ప్రపంచ వాణిజ్యంలో బంగారం కంటే వెండికి గిరాకీ ఎక్కువుగా కనిపిస్తోందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. బుధవాం వెండి కిలో ఏకంగా రూ.11,000 పెరిగి రూ.2.22 లక్షల మార్కుకు చేరాయి.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వెండి ధరలు రూ.87,578 నుంచి రూ.1,18,533 లేదా 135.34 శాతం పెరిగాయి. కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లపై అనిశ్చితి, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, డాలర్ విలువలు హెచ్చతగ్గులు బంగారానికి డిమాండ్‌ను మరింత పెంచేసింది. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 పెరిగి రూ.1,34,510 వద్ద పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరిగి 1,23,300 పలుకుతోంది. వెండి ఏకంగా రూ.11 వేలు పెరిగింది. దీంతో ఓవరాల్‌గా సిల్వర్ రేటు రూ.2,22,000కు చేరుకుంది.