8 June, 2026 | 4:32 PM

Breaking News

గ్రామ ప్రగతికి ప్రతి ఒక్కరు సహకరించాలి   •   ముదిరాజ్ సంఘానికి ప్రొసీడింగ్ అందజేసిన సర్పంచ్ గండి నారాయణ   •   శ్రీ కోటి లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు   •   సీఎం రేవంత్‌ హిట్లర్‌ కామెంట్స్‌పై మంత్రి శ్రీధర్‌ బాబు వివరణ   •   గ్రామ పంచాయతీలో సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తాం: తాహశీల్దార్   •   పూర్తి వేతనం విడుదల చేయాలని లెక్చరర్ల వినతి   •   మద్యం మత్తు వీడితేనే గ్రామాల అభివృద్ధి ముందుకు.!   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి   •   ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ   •   అయ్యప్ప ఆలయ నూతన కమిటీ అధ్యక్షుడు బొగ్గుల సురేష్‌కు సన్మానం   •  

ఒక్కరోజే రూ.11 వేలు పెరిగిన వెండి

18-12-2025 01:07 AM

కిలో రూ.2.20 లక్షలు దాటిన ధర

హైదరాబాద్, డిసెంబర్ 17: అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. సామాన్యులకు అందనంత ఎత్తులో పసిడి, వెండి ధరలు ఉన్నాయి. ముఖ్యంగా వెండి ధరలు కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే వెండి కిలో రూ.11 వేలు పెరిగింది. అలాగే బంగారం కూడా రూ.650 పెరిగి రూ.1,34,510కి చేరుకుంది. ప్రపంచ వాణిజ్యంలో బంగారం కంటే వెండికి గిరాకీ ఎక్కువుగా కనిపిస్తోందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. బుధవాం వెండి కిలో ఏకంగా రూ.11,000 పెరిగి రూ.2.22 లక్షల మార్కుకు చేరాయి.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వెండి ధరలు రూ.87,578 నుంచి రూ.1,18,533 లేదా 135.34 శాతం పెరిగాయి. కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లపై అనిశ్చితి, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, డాలర్ విలువలు హెచ్చతగ్గులు బంగారానికి డిమాండ్‌ను మరింత పెంచేసింది. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 పెరిగి రూ.1,34,510 వద్ద పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరిగి 1,23,300 పలుకుతోంది. వెండి ఏకంగా రూ.11 వేలు పెరిగింది. దీంతో ఓవరాల్‌గా సిల్వర్ రేటు రూ.2,22,000కు చేరుకుంది.