28-01-2026 12:00:00 AM
అలంపూర్, జనవరి 27: కొత్త రాజోలిలో ప్రభుత్వ భవనాలకు కార్యాలయాలు ఏర్పా టు చేయాలని గత కొన్ని రోజుల నుంచి కొత్త రాజోలి అఖిలపక్ష కమిటీ సభ్యులు అధికారులకు విన్నవించారు.ఇందులో భా గంగా మంగళవారం మండల అధికారులు తీసుకునేందుకు స్థల పరిశీలన చేపట్టారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సమస్యల పరిష్కారం కొరకు మార్గం ఏర్పడి నందున అఖిలపక్ష కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన మండ ల అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.