అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ
11-04-2026 12:00 AM
పాల్గొన్న ఎమ్మెల్యే రామారావు పటేల్
భైంసా, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : ముధోల్ ఐసిడిఎస్ పరిధిలో అంగన్వాడీలకు ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే రామారావు పటేల్ శుక్రవారం పంపిణీ చేశారు. బైంసాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పలువురు అంగన్వాడి కార్యకర్తలకు వీటిని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి వినూత్న ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు.




