2 July, 2026 | 2:56 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

రోడ్డు పనులు పరిశీలించిన మాజీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్

02-06-2025 01:27 AM

ఘట్ కేసర్, జూన్ 1 (విజయ క్రాంతి): త్వరలో నూతన టెక్నాలజీతో వంద ఫీట్ల రోడ్డు పనులు ప్రారంభం కానుండడంతో ఘట్కేసర్ పట్టణం దిశ మారిపోతుందని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ముల్లి పావని జం గయ్య యాదవ్ అన్నారు. ఘట్కేసర్ పట్టణంలోని శివారెడ్డిగూడ నుండి మాధవరెడ్డి బ్రిడ్జి వరకు దాదాపు రూ. 30 కోట్ల నిధులతో 2.5 కిలోమీటర్ల రోడ్డు ట్రైయల్ ప నులను మాజీ చైర్మన్ పావని జంగయ్యయాదవ్  స్థానిక నాయకులతో కలసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 100 ఫీట్ల రోడ్డు పనులు ప్రారంభం కావడం హర్షనీయమని, ఇట్టి రోడ్డు కోసం కోరిన వెంకటనే స్పందించి గత సంవత్సరం ప్రజాపాలన విజయో త్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిధులు మంజూరు చేయడం, దానికి సహకరించి నడిపించిన నియోజకవర్గం ఇంచార్జీ  తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కొత్త టెక్నిలజీతో చేపడుతున్న రోడ్డు పనులకు రోడ్డుకు ఇరువై పుల ఉన్న ప్రజలు సహకరించాలని కోరారు. రూ. 30 కోట్లతో 2.5 కిలోమీటర్ల పొడువు 100 ఫీట్ల రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారని, దీనితో ఘట్కేసర్ పట్టణం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఈకార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ , మాజీ కౌన్సిలర్ కడుపోల్ల మల్లేష్, డిసిసి కార్యదర్శి ఉల్లి అంజనేయులుయాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్క సంజీవరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మోత్కుపల్లి శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు  ఫారుక్, నాయకులు రెహమాన్, ఖయ్యూం, బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.