13-06-2025 08:50:33 PM
హనుమకొండ(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ అదనపు కమిషనర్ గా పనిచేస్తున్న స్నేహ శబరీష్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లాకు మూడోసారి మహిళా కలెక్టర్. 2017 ఐఏఎస్ బ్యాచ్ కు చెందినవారు. 1994లో చెన్నైలో జన్మించారు అక్కడే స్టెల్లా మారిస్ కళాశాలలో బీఎ పూర్తి చేశారు. ఆమె భర్త శబరిష్ కుమార్ ప్రస్తుతం ములుగు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. మొదటగా రంగారెడ్డి జిల్లా సహాయ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. అనంతరం 2020లో ఆసిఫాబాద్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. 2024లో గ్రేటర్ హైదరాబాద్ అదనపు కమిషనర్ గా నియమితులయ్యారు. ఉత్తమ పనితీరుతో పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత కలెక్టర్ పి.ప్రావిణ్య సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. తన పనితీరుతో ప్రజల మన్నలను అందుకున్నారు.