టైర్పేలి కూల్ డ్రింక్స్ వాహనం బోల్తా..
11-05-2026 01:09 AM
డ్రైవర్కు గాయాలు
మద్నూర్, మే 10 (విజయక్రాంతి); కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రం నుండి బిచ్కుంద కు వెళ్తున్న స్ప్రుటై, థమ్సప్(కూల్ డ్రింక్స్) వాహనం ఆదివారం టైరు పేలి లారీ బోల్తా పడింది , లారీ లో తరలిస్తున్న కూల్ డ్రింక్స్ 161 వ జాతీయ రహదారిపై చెల్లా చెదరుగా పడిపోయాయి. కూల్ డ్రింక్స్ బాటిల్స్ చాలావరకు ధ్వంసమయ్యాయి.
ఈ ఘటన మద్నూర్ మండలం రుషి గావ్ చౌరస్తా వద్ద161వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. బోల్తా పడిన వాహనాన్ని పక్కకు తరలించారు. అనంతరం కూల్ డ్రింక్స్ ఏజెన్సీ యాజమాన్యం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.






