26 April, 2026 | 9:37 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

కరెంటు కష్టాలు తీర్చండి

11-06-2024 12:00 AM

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తలెత్తుతున్న తీవ్రస్థాయి కరెంటు కష్టాలను ఉన్నతాధికారులు తీర్చే కోణంలో చర్యలు తీసుకుంటున్నట్టు వచ్చిన వార్తలు ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. విద్యుత్ సరఫరాలో పదేపదే ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేలా వారు ఆలోచనలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వాటిని ఆచరణలోకి తేవడంలో వారు చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. ప్రతి ఫీడర్‌ను సీఎండీ పరిశీలించేలా తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీనిని హర్షించదగ్గ చర్యగా చెప్పాలి.

ఇందుకోసం ‘ఫీడర్ సర్వే’ పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఎస్పీడీసీఎల్ రూపొందించినట్టు చెబుతున్నారు. దీనితో 24 గంటల పర్యవేక్షణ సాధ్యమవుతుందన్నమాట. అప్పుడు తరచూ కలిగే అంతరాయాలు, వాటికి కారణాలు అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు వస్తాయి. ఇదే సమయంలో అవి కలుగకుండా అన్ని చర్యలూ తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే కొత్త ప్రభుత్వానికి కరెంటు సరఫరా విషయంలో మంచి పేరు వస్తుంది.  

  ప్రభాకర్‌రెడ్డి, నాగార్జునసాగర్