11-06-2024 12:00:00 AM
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తలెత్తుతున్న తీవ్రస్థాయి కరెంటు కష్టాలను ఉన్నతాధికారులు తీర్చే కోణంలో చర్యలు తీసుకుంటున్నట్టు వచ్చిన వార్తలు ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. విద్యుత్ సరఫరాలో పదేపదే ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేలా వారు ఆలోచనలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వాటిని ఆచరణలోకి తేవడంలో వారు చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. ప్రతి ఫీడర్ను సీఎండీ పరిశీలించేలా తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీనిని హర్షించదగ్గ చర్యగా చెప్పాలి.
ఇందుకోసం ‘ఫీడర్ సర్వే’ పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్ను ఎస్పీడీసీఎల్ రూపొందించినట్టు చెబుతున్నారు. దీనితో 24 గంటల పర్యవేక్షణ సాధ్యమవుతుందన్నమాట. అప్పుడు తరచూ కలిగే అంతరాయాలు, వాటికి కారణాలు అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు వస్తాయి. ఇదే సమయంలో అవి కలుగకుండా అన్ని చర్యలూ తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే కొత్త ప్రభుత్వానికి కరెంటు సరఫరా విషయంలో మంచి పేరు వస్తుంది.
ప్రభాకర్రెడ్డి, నాగార్జునసాగర్