30-06-2025 06:45:01 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో విద్యాశాఖ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేశారు. జిల్లాలోని పలు ప్రైవేట్ స్కూళ్లలో తల్లిదండ్రుల నుంచి స్కూలు యాజమాన్యం నోట్ పుస్తకాలు, స్కూలు సామాగ్రి పేరుతో దోపిడీ చేస్తున్నారని దీన్ని వెంటనే కలెక్టర్ అరికట్టాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శశిధర్(ABVP District Convener Shashidhar) తెలిపారు. ఇప్పటికే రాంపూర్ నర్సాపూర్ నిర్మల్ ప్రాంతాల్లో ప్రైవేటు పుస్తకాలను ఏబీవీపీ విద్యార్థులు బయటకు తెచ్చారని అధికారులు వెంటనే వారిపై చర్య తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు దినేష్ సాయిరాం గణేష్ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.