ఫిఫా మ్యాగ్జైన్లో కేరళ ప్రొఫెసర్ పాటలు
కాలికట్, జూన్ 6: సాకర్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఫిఫా ప్రపంచకప్ మరో ఐదు రోజుల్లో మొదలుకానుంది. అమెరికా, మెక్సికో, కెనడా కలిసి ఆతిథ్య మిస్తున్న ఈ మెగా టోర్నీలో ఈ సారి 48 దేశాలు పాల్గొంటున్నాయి. దీంతో ఈ ఎడిషన్ అతిపెద్ద ప్రపంచకప్గా నిలవనుంది. ఇప్పటికే సాకర్ వరల్డ్కప్ ఫీవర్ ఊపేస్తోంది.
ఈ ఫీవర్కు కేరళ ప్రొఫెసర్ తాను స్వరపరిచిన పాటలతో మరింత ప్రత్యేకతను తీసుకొచ్చారు. కేరళకు చెందిన ప్రొఫెసర్ వశిష్ట్, ఆయన విద్యార్థులు ఫిఫా ప్రపంచకప్కు స్వాగతం చెబుతూ రాసిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ పాటలు ఫిఫా మ్యాగ్జైన్లో సైతం ప్రచురించారు. అర్జెంటీనా దిగ్గజాలు డిగో మారడోనా, లైనోల్ మెస్సీపై రాసిన రెండు పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. శాంతి కోసం ఫుట్బాల్ సందేశాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతో ఈ పాటలు స్వరపరిచినట్టు ప్రొఫెసర్ వశిష్ట్ చెప్పారు.






