జిల్లా కార్యాలయానికి స్థలం కేటాయించాలి
13-05-2025 12:00 AM
నిర్మల్ మే 12 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కొరకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం కలెక్టర్ అభిలాష అభినవను కోరుతూ వినతిపత్రం అందజేశారు. పార్టీ ఆదేశాలకు త్వరలో జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి అబ్దుల్ ఆది పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాందేడ్ చిన్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






