16 March, 2026 | 3:03 PM

Breaking News

యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో   •   అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •  

నార్సింగి సర్కిల్లో స్పెషల్ డ్రైవ్

07-01-2026 01:14 AM

చెత్త పాయింట్ల తొలగింపు

పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు

మణికొండ, జనవరి 6 (విజయక్రాంతి) : నార్సింగి సర్కిల్ 45లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కమిషనర్, డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేర కు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి చెత్త పాయింట్లను శాశ్వతంగా తొలగించారు. నగర సుందరీకరణలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందితో శుభ్రం చేయించారు.ఆయా ప్రాంతాల్లో మళ్లీ చెత్త వేయకుండా అవగాహన కల్పిస్తూ ముగ్గులు వేసి, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఈ ఎస్ డబ్ల్యూ ఎం నరేష్, ఏఈ ఎస్ డబ్ల్యూ ఎం సంతోష్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ లచ్చిరాం పాల్గొన్నారు. శానిటేషన్ జవాన్లు, సిబ్బంది సమన్వయంతో పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. ప్రజలు బహిరంగంగా చెత్త వేయకుండా పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని అధికారులు కోరారు.