07-06-2025 12:07:10 AM
- వరద నీరు నిలిచే ప్రాంతాలపై 4 నెలలపాటు అధ్యయనం
- హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని నా లాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వచ్చే 4 నెలల పాటు ఈ అంశంపైనే దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. వరదనీరు నిలిచే ప్రాంతాలపై ప్ర త్యేక అధ్యయనం చేయనున్నట్లు వెల్లడించా రు.
నాలా, నీటి వనరుల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామని, నాలాలపై అక్ర మంగా నిర్మించిన వాణిజ్య భవనాలను తొ లగిస్తామని హెచ్చరించారు. పేదల నిర్మాణాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా మని చెప్పారు. శుక్రవారం ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల ఆధారంగా జీహెచ్ఎంసీ ఇరిగేషన్, ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ అధికారులతో పాటు కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నా యక్తో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటన జరిపారు. హస్మత్పేట, పికెట్ నాలాలను నిశితంగా పరిశీలించారు.
ప్యాట్నీ వద్ద 17 మీటర్ల వెడల్పుతో ఉండాల్సిన నాలా.. దాదాపు 150 మీటర్ల పొడవునా కేవలం ఆరు నుంచి ఏడు మీటర్లకే కుంచించుకుపోయిందని గుర్తించారు. దీనివల్ల మహేంద్ర హిల్స్, పికెట్, జేబీఎస్, బాలంరాయ్, విమాన్నగర్ వంటి ప్రాంతాలు ప్రతి వర్షాకాలంలోనూ ముంపునకు గురవుతున్నాయని స్థానికులు పాత ఛా యాచిత్రాలను చూపిస్తూ వివరించారు. చికోటీ గార్డెన్స్, ప్రకాష్నగర్ మెట్రో స్టేషన్ వ ద్ద కూడా ఇదే విధమైన దుస్థితిని గమనించా రు.
అక్కడ 6 మీటర్ల వెడల్పు ఉన్న వరద కా లువ కొన్ని చోట్ల 4.5 మీటర్ల మేర ఆక్రమణకు గురైందని, మరికొన్ని చోట్ల నాలాను ఇష్టానుసారం మళ్లించారని స్థానికులు ఫిర్యా దు చేశారు. నాలాల కబ్జాలపై హైడ్రా అత్యం త పటిష్టంగా వ్యవహరిస్తుందని, అక్రమంగా నిర్మించిన భవనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. ఏటా వర్షాలు కురిసినప్పుడు నగరంలోని ప లు ప్రాంతాలు నీట మునిగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యకు ప్రధాన కారణం సహజ నీటి ప్రవాహ మా ర్గాలైన నాలాల అక్రమ ఆక్రమణలే అని పేర్కొన్నారు.