07-06-2025 12:05:47 AM
- కత్తితో పొడిచిన దుండగులు
- ఫిజియోథెరపీ చేస్తామని ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు
- చోరీ లేదా ఆస్తి తగాదాలతోనే మర్డర్?
- రాజేంద్రనగర్ జనచైతన్య ఫేస్- ఘటన
రాజేంద్రనగర్, జూన్ 6: ఫిజియోథెరపీ చేస్తామని ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దుం డగులు.. వృద్ధ దంపతులను కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనచైతన్య ఫేస్ శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. డీసీపీ చింతమనేని శ్రీనివాస్ మీ డియాకు వివరాలు వెల్లడించారు.
షేక్ అబ్దు ల్లా(70) ఎస్బీఐ విశ్రాంత ఉద్యోగి, ఆయన భార్య రిజ్వాన్ విశ్రాంత లెక్చరర్(65). వీరు జన చైతన్యలో కొత్తగా అబ్రీజ్ పేరుతో అపార్ట్మెంట్ నిర్మించుకున్నారు. సుమారు 40 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి 5వ అంతస్తులో ఉంటున్నారు. మిగతా ప్లాట్లను అద్దె కు ఇచ్చారు. వీరికి నలుగురి సంతానంకాగా వారంతా అమెరికా, లండన్లో ఉంటున్నారు. దీంతో దంపతులు ఇద్దరే ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయం త్రం వీరి ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకరు మాస్క్, క్యాప్తో ఉండగా మరో వ్యక్తి బురఖా ధరించి ఉన్నాడు.
మా స్క్ ఉన్న వ్యక్తి తాము ఫిజియోథెరపీ చేసేందుకు వచ్చామని అపార్ట్మెంట్ వాచ్మెన్కు చెప్పాడు. వాచ్మెన్ షేక్ అబ్దుల్లా దంపతులకు కాల్ చేసి చెప్పడంతో వాళ్లు అనుమ తించారు. పైఅంతస్తులోకి వెళ్లిన అనంతరం 40 నిమిషాల తర్వాత ఇద్దరిలో ఒకరు కిం దికి వచ్చారు. అరగంట తర్వాత మరో వ్యక్తి వచ్చాడు. శుక్రవారం అపార్ట్మెంట్వాసులు చూడగా ఇద్దరూ రక్తపు మడుగులో విగతజీవులుగా ఉన్నారు. నిందితులు తమతో తె చ్చుకున్న కత్తితో దంపతులపై విచక్షణారహితంగా దాడి చేసినట్టు తెలిసింది. అబ్దుల్లా ఒంటిపై ఏడు కత్తిపోట్లు, రిజ్వానా ఛాతిపై ఒ క కత్తిపోటు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
సొత్తు కోసం హత్య చేశారా?
వృద్ధ దంపతులను హత్య చేసిన అంనంతరం నిందితులు ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందరగా పడేశారు. ఆస్తికి సంబంధించిన పత్రాలు కూడా కనిపించినట్లు పోలీ సులు తెలిపారు. ఈ నేపథ్యంలో దుండగు లు డబ్బు, బంగారం కోసమో లేదా ఆస్తి ప త్రాల కోసమే హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆస్తి తగాదాల నేప థ్యంలో బంధువులే హత్య చేశారా అనే కో ణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. దుండగు ల ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గా లిస్తున్నట్లు వివరించారు. మృతుల సంతానంతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పే ర్కొన్నారు. వారితో మాట్లాడితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని ఆయన అభి ప్రాయపడ్డారు. పోస్టుమార్టం నిమిత్తం మృ తదేహాలను ఉస్మానియాకి తరలించారు.