13 April, 2026 | 12:13 PM

Breaking News

వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •  

మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి

28-11-2025 12:00 AM

రాచకొండ సీపీ సుధీర్ బాబు

ఎల్బీనగర్, నవంబర్ 27 : మహిళలను వేధించే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, మహిళల భద్రతపై  ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో రాచకొండ షి టీమ్ పోలీసులు మఫ్టీలో తిరుగుతూ డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని తెలిపారు. బాలికలను, మహిళలను వెంబడించి వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా న్యాయస్థానంలో హాజరు పరుస్తూ, వారి  తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు.

పోకిరీలకు కౌన్సిలింగ్..

రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు గురువారం రాచకొండ క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలింగ్  నిర్వహించారు. అందులో భాగంగా రాచకొండ  కమిషనరేట్ పరిదిలో మహిళలను వేదింపులకు గురిచేస్తున్న 110 (మేజర్స్-74  ,మైనర్స్-36  ) మందిని ఎల్బీనగర్  ఉమెన్ సేఫ్టీ ఆఫీసులో, కౌన్సిలర్స్ తో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ నెల తేదీ 1 నుంచి  15వ  తేదీ వరకు 135 ఫిర్యాదులు అందాయి.

ఈ మేరకు 110 మందిపై కేసు నమోదు చేశారు. ఫోన్ల ద్వారా వేదించినవి  34, సోషల్ మీడియా ద్వారా వేదించినవి 48, నేరుగా వేదించినవి 53 ఫిర్యాదులు అందాయని విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషారాణి  తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ టి.ఉషారాణి, ఏసీపీ పల్లె వెంకటేశ్వర్లు  ఇన్ స్పెక్టర్లు ఎం.ముని, జి.అంజయ్య, అడ్మిన్ ఎస్త్స్ర రాజు, షీ టీమ్స్ సిబ్బంది, కౌన్సిలర్స్ పాల్గొన్నారు.