04-11-2025 07:44:24 PM
నిర్వహణ ఏర్పాట్లు, సమన్వయం చేసుకోవాలి
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష
చిట్యాల (విజయక్రాంతి): ఈ నెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకునేలా, పరిష్కార మార్గం చూపాలని రామన్నపేట సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్.శిరీష సమక్షంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్జీ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న కేసులు వేగవంతంగా పరిష్కారం అయ్యేలా అన్ని విభాగాల అధికారులు, న్యాయవాదులు, సంబంధిత సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవడానికి కక్షిదారులకి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. వేంకటేశ్వర్లు, రామన్నపేట, వలిగొండ, ఎస్ఐ లు డి.నాగరాజు, యుగేందర్ గౌడ్, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.