25-06-2025 12:53:29 AM
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ జూన్ 24:(విజయ క్రాంతి) : జనసంఘ్ వ్యవ స్థాపకులైన ముఖర్జీ దేశ సమగ్రత, ఐక్యత కోసం హిందువులలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునరనిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో భారతీయ జన సంఘం స్థాపించడం జరిగిందన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దంపాల్ సూర్యనారాయణ. జాతి ఐక్యతకు ముప్పుగా భావించే ఆర్టికల్ 370ని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకంచారని ఆయన గుర్తు చేశారు.
భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామప్రకాష్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్బంగా దుబ్బ చౌరస్తాలో నిర్వహించిన మొక్కల పంపిణి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహి ఛాలెంగే (ఒకే దేశానికి రెండు రాజ్యాంగలు, ఇద్దరు ప్రధానులు మరియు రెండు జాతీయ చిహ్నలు ఉండకూడదు )అన్నారు.
నరేంద్రమోదీ గారు ముఖర్జీ ఆశయాలకు, ఆకాంక్షాలకు అనుగుణంగా 370 ఆర్టికల్ రద్దుచేసి కాశ్మీర్ ను సుందరికరణ చేయడాన్ని మనం చూస్తున్నాం అన్నారు. ఆయన మరణం మిస్టరీగా నిలిచిపోయిందన్నారు. ఆ మహనీయుని త్యాగానికి గుర్తుగా బలిదాన్ దివస్ జరుపుకుంటున్నాం అని సందర్భంగా ఆయన తెలియజేసారు. అనంతరం మహిళలకు ఎమ్మెల్యే మొక్కలు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పంచ రెడ్డి ప్రవళిక ,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, దుబ్బ మండల అధ్యక్షులు గడ్డం రాజు, ఇంటలెక్చువల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ కొండా ఆశన్న , తాజా మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్, మహిళా మోర్చా మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.