30 March, 2026 | 11:12 PM

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం

30-03-2026 09:21 PM

హనుమకొండ డిఎంహెచ్వో డాక్టర్ ఏ. అప్పయ్య

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం డాక్టర్ మాలిక ఆధ్వర్యంలో వడ్డేపల్లి హోమియో డిస్పెన్సరీ (చమాన్) ఆవరణంలో నిర్వహిస్తున్న, ప్రత్యేక వైద్య శిబిరమును హనుమకొండ డిఎంహెచ్వో డాక్టర్ ఏ. అప్పయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానికంగా వైద్యాధికారులు, సిబ్బంది సేవలు రెగ్యులర్గ అందిస్తున్నప్పటికీ, ఆరుగురు స్పెషలిస్ట్ వైద్య నిపుణులు గైనకాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, చిల్డ్రన్, డెంటిస్ట్, సేవలందిస్తున్నారని, అందువలన ఈ శిబిరం ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

మెరుగైన సేవల నిమిత్తం డాక్టర్లు రిఫర్ చేసిన వారి వివరములు, తమ వద్ద విడివిడిగా నమోదు చేసుకోవాలన్నారు. ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీనివాస్ శిబిరాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. ముందుగా ఉచిత వైద్య సేవలో పాల్గొన్న ప్రజలకు ఆరోగ్య శాఖ ద్వారా చేపడుతున్నటువంటి ఆరోగ్య కార్యక్రమాలు, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. శిబిరంలో 264 మందికి పరీక్షలు నిర్వహించారు. 11 మందికి టాప్ స్మైరూ టెస్టులు, 35 మందికి ల్యాబ్ టెస్టులు నిర్వహించారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు.