15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సాయి మందిరంలో ప్రత్యేక పూజలు అన్నదానం

11-12-2025 05:10 PM

ఆలయ కమిటీ చైర్మన్ నల్లపాటి నరసింహారావు

కోదాడ: కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామం సాయి మందిరంలో ఈదర నరసింహారావు చిట్టెమ్మ దంపతుల చిన్న కుమారుడు ఈదర రవిచంద్ర(లేటు) వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ నలపాటి నరసింహారావు మాట్లాడుతూ ప్రతి గురువారం దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. పూజల అనంతరం దేవాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం జరిపి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముండ్ర నరసింహారావు, ఈదర వెంకటేశ్వర్లు, ముండ్ర వెంకయ్య, సుబ్బారావు,  వినయ్ కుమార్, అజయ్‌, అర్చకులు సాయి శర్మ,తో పాటు అనేక మంది భక్తులు పాల్గొన్నారు.