11-12-2025 05:10:20 PM
ఆలయ కమిటీ చైర్మన్ నల్లపాటి నరసింహారావు
కోదాడ: కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామం సాయి మందిరంలో ఈదర నరసింహారావు చిట్టెమ్మ దంపతుల చిన్న కుమారుడు ఈదర రవిచంద్ర(లేటు) వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ నలపాటి నరసింహారావు మాట్లాడుతూ ప్రతి గురువారం దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. పూజల అనంతరం దేవాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం జరిపి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముండ్ర నరసింహారావు, ఈదర వెంకటేశ్వర్లు, ముండ్ర వెంకయ్య, సుబ్బారావు, వినయ్ కుమార్, అజయ్, అర్చకులు సాయి శర్మ,తో పాటు అనేక మంది భక్తులు పాల్గొన్నారు.