calender_icon.png 2 June, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠ్య పుస్తకాల పంపిణీ వేగవంతం

31-05-2025 06:22:57 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాబోయే విద్యా సంవత్సరం బడులు తెరిచే నాటికి విద్యార్థుల చేతుల్లో పాఠ్యపుస్తకాలు ఉండాలనే ఉద్దేశంతో జూన్ మూడవ తేదీ నాటికి పాఠశాలలకు పుస్తకాలు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(District Collector Jitesh V Patil) ఆదేశానుసారం శనివారం డీఈఓ వెంకటేశ్వర చారి పుస్తకాల పంపిణీ ప్రారంభించారు. పాత కొత్తగూడెంలోని పుస్తక నిల్వ గోదాం నుంచి రెసిడెన్షియల్ పాఠశాలలకు, గురుకుల పాఠశాలలకు, గిరిజన ఆశ్రమ పాఠశాలలకు ఇప్పటికే పుస్తకాల చేరవేయడం జరిగిందన్నారు.

వివిధ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు, మండల విద్యా వనరుల కేంద్రాలకు పాఠ్యపుస్తకాలను చేరవేనున్నట్లు తెలిపారు. జిల్లాకు 5,08,400 పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటివరకు 4,54,925,(89.4 శాతం) పుస్తకాలు జిల్లాకు చేరినట్లు తెలిపారు. వచ్చిన మొత్తం పుస్తకాలలో ఎప్పటి వరకు 509 శాతం పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. 23 మండలాల్లో 12 మండలాలకు పుస్తకాలను సరఫరా చేయడం పూర్తయింది అన్నారు. మిగిలిన మండలాలకు మరో రెండు రోజుల్లో చేరవేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మండల విద్యాశాఖ అధికారి ప్రభుదయాల్ పాల్గొన్నారు.