06-02-2026 02:03:07 AM
శ్రీ శ్రీ ధర్మ గురు సరస్వతి ఆనంద్ మహారాజ్
భైంసా, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లావీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో ఈనెల 26న ముథోల్ మండల కేంద్రంలో బసవగార్డెన్లో ధర్మ గురు పరిరక్షణ మహాసభ నిర్వహిస్తున్నట్లు ఉజ్జయిని మహారాజ్ ధర్మ గురు సరస్వతి ఆనంద్ మహారాజ్ తెలిపారు. గురువారం ఆత్మీయ సమ్మేళనం ధర్మసభ నిర్వహణపై బాసరలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బసవేశ్వర మార్గం తదితర అంశాలపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో ధర్మ ప్రచారం కోసం కృషి చేస్తున్న వివిధ పీఠాధిపతులు ఈ ఆత్మీయ సమ్మేళనానికి వస్తున్నారని ప్రజలు కూడా భారీ సంఖ్యలో తరలిరా వాలని ఆనంద్ మహారాజ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ రాష్ట్ర అధ్యక్షులు దినేష్ పటేల్. గౌరవ అధ్యక్షులు గంగాధర్ పటేల్ జిల్లా అధ్యక్షులు శంకర్ పటేల్ ఉపాధ్యక్షులు సాయినాథ్ పటేల్ ప్రధా న కార్యదర్శి గణేష్ పటేల్ జిల్లా కమిటీ సభ్యు లు పాల్గొన్నారు.