calender_icon.png 15 February, 2026 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలో స్పోర్ట్స్ మీట్

15-02-2026 01:08:23 AM

పాల్గొన్న టీఎన్ శ్రీనివాస్..

సికింద్రాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): రసూల్ పుర గన్ బజార్ జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం నాడు స్పోరట్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి  బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌టిఎన్ శ్రీనివాస హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోచ్ ఫౌండేషన్ చైర్మన్ సాయిబాబా సహకారం తోవాలీబాల్, బాస్కెట్బాల్  టోర్నమెంట్లలో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా  క్రీడాకారులకు కూడా ప్రిన్సిపాల్ రంగానాథ్ చేతుల మీదుగా క్రీడా పరికరాలను పాఠశాల విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మైనారిటీ నాయకుడు వహాబ్, అమీర్, సజీద్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.