15-02-2026 01:08:23 AM
పాల్గొన్న టీఎన్ శ్రీనివాస్..
సికింద్రాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): రసూల్ పుర గన్ బజార్ జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం నాడు స్పోరట్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్టిఎన్ శ్రీనివాస హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోచ్ ఫౌండేషన్ చైర్మన్ సాయిబాబా సహకారం తోవాలీబాల్, బాస్కెట్బాల్ టోర్నమెంట్లలో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా క్రీడాకారులకు కూడా ప్రిన్సిపాల్ రంగానాథ్ చేతుల మీదుగా క్రీడా పరికరాలను పాఠశాల విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకుడు వహాబ్, అమీర్, సజీద్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.