calender_icon.png 24 November, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా స్పోర్ట్స్ పాలసీ

24-11-2025 12:45:09 AM

  1. క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి పెంచుకోవాలి

రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి

హనుమకొండ, నవంబర్ 23(విజయ క్రాంతి): ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్పోరట్స్ పాలసీని తీసుకువచ్చిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరి శ్రమ అభివృద్ధి, యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం ఉదయం నాయిని విశాల్ ఫౌండేషన్, క్రెడా యి వరంగల్, తెలంగాణ రన్నర్స్, కియాన్ ఇన్ ఫ్రా సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ ట్రైసిటీ హాఫ్ మారథాన్ 2025ను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి,

రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎ మ్మెల్యే కెఆర్ నాగరాజు, మేయర్ గుండు సు ధారాణి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, నిర్వాహకులు విష్ణువర్ధన్ రెడ్డి, తదితరుల సమక్షంలో హాఫ్ మారథాన్ పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీ హరి మాట్లాడుతూ క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తిని పెంపొందించు కోవాలన్నారు. క్రీడాకారుల్లో నైపుణ్యాలను వెలికి తీసేందుకు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పోరట్స్ పాలసీని తీసుకువచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులను ప్రో త్సహించే విధంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందు కు క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా రాష్ట్రంలోనే 4వ క్రీడా పాఠశాలను సీఎం జిల్లాకు కేటాయించారని తెలిపారు. యువత, విద్యార్థులు చిన్న చిన్న సమస్యలకే ఒత్తిడి, న్యూనతకు లోనవుతున్నారన్నారు. సీఎం సంకల్పంతో క్రీడా పాలసీని అమలు చేస్తున్నారని, దీంతో రాష్ట్రంలోని వేలాది మైదానాలను క్లీన్ చేస్తున్నామని పేర్కొన్నారు.

క్రీడాకారులను తీర్చిదిద్దే విధం గా అంతర్జాతీయ కోచ్ లను తీసుకువచ్చి క్రీడల్లో విద్యార్థులు, యువత రాణించే విధం గా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడినుండే దేశానికి, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేలా చేస్తామన్నారు. మారథా న్ లో పాల్గొంటున్న క్రీడాకారులు నీలిరంగు టీ షర్టులు ధరించి పరిగెడుతుంటే వరంగల్ కు బ్లూ పెయింట్ వేసినట్టు ఉందన్నారు.

మారథాన్ నిర్వహణతో మంచి వాతావరణాన్ని జిల్లా నుండి రాష్ట్రానికి తద్వారా దేశానికి పరిచయం చేసినట్లయిందని అన్నారు. తాను రంజీ గేమ్స్ ఆడుతున్న సమయంలో తన తల్లిదండ్రులు ఎందుకు ఆటలాడుతున్నావని తిట్టేవారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ పిల్లలు ఎందుకు ఆటలు ఆడడం లేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారన్నారు.

తమ పిల్లలను క్రీడల్లో రాణించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. విజ య డెయిరీకి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. దాదాపు 35 కోట్ల రూపాయలతో వి జయ డెయిరీని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. నాయిని విశాల్ ఫౌండేషన్, ఇతర సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మారథాన్ నిర్వహించినందుకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, జి ల్లా గ్రంధాయల చైర్మన్ అజిజ్ ఖాన్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, క్రెడాయి ప్రతినిధు లు, రాష్ట్రంలోని జిల్లాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అథిలెట్స్ 5, 10, 21 కె రన్ మారథాన్ లో పాల్గొన్నారు.