విద్యార్థులకు గుడ్న్యూస్.. గురుకులంలో స్పాట్ అడ్మిషన్లు: డీసీఓ
22-08-2026 08:15 AM
బోధన్ ఆగస్టు 22(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల బాలుర పాఠశాల, కళాశాలలో ఖాళీల భర్తీకి ఈ శనివారం రోజున 22న స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు డీసీఓ విజయ లలిత తెలిపారు. 5 నుంచి 9 తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం బాలికల 160 సీట్లు బాలురు 240సీట్లు ఖాళీగా ఉన్నట్టు వెల్లడించారు. బాలికలకు కంజర గురుకుల పాఠశాలలో బాలురలకు ఆర్మూర్ గురుకుల పాఠశాలలో ఉదయం 9 నుంచి 4 గంటల వరకు సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు.






