29-07-2025 05:50:13 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ సీవోఈ కళాశాలలో ఇంటర్నెట్ మొదటి సంవత్సరం ఎంపీసీ బైపీసీ గ్రూపులో ఖాళీల భర్త కోసం ఈనెల 31న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అకిడి విజయ సాగర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సీవోఈ స్పాట్ కౌన్సిలింగ్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ అలుగు వర్షిని ఆదేశానుసారంగా బాలుర సిఓఈ బెల్లంపల్లి ఇంటర్నెట్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూప్స్ లో ఖాళీగా ఉన్న సీట్ల కొరకు స్పాట్ కౌన్సిలింగ్ చేపట్టనున్నామని తెలిపారు.
తేదీ 31 ఉదయం 9 గంటల నుండి ఒంటిగంట వరకు అప్లికేషన్ ఫామ్స్ సమర్పించ వలసి ఉంటుందని పేర్కొన్నారు. ఒంటి గంట తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తులు తీసుకోబడన్నారు. స్పాట్ కౌన్సిలింగ్ కి వచ్చేటప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకురావాలని, మార్చి 2025 రెగ్యులర్గా ఉత్తీర్ణత సాధించి 70% మార్కులు పైన ఉన్న విద్యార్థులు మాత్రమే కౌన్సిలింగ్ కు హాజరు కావాలరని తెలిపారు. యంపిసి బైపిసి గ్రూపుల ఖాళీ సీట్ల వివరాలు ఎస్సీ క్యాటగిరిలో ఎంపీసీ 10,బైపిసి 20 సీట్లు కలవనీ పేర్కొన్నారు. ఎస్టీ క్యాటగిరిలో ఎంపీసీ ఒకటి, బైపీసీ రెండు బీసీ కేటగిరిలో ఎంపీసీ రెండు బైపిసి 5 ఓసి క్యాటగిరిలో ఎంపీసీ ఒకటి, బైపిసి రెండు, మైనార్టీ కేటగిరి లో ఎంపీసీ ఒకటి,బైపిసి ఒకటి చొప్పున సీట్లు కలవని ప్రిన్సిపల్ తెలిపారు.