రౌడీ షీట్లకు ఎస్ఆర్ నగర్ పోలీసులు హెచ్చరిక
23-05-2026 09:09 PM
సనత్నగర్,(విజయక్రాంతి): బక్రీద్ పండుగ ప్రశాంతంగా సాగేందుకు సంజీవ్ రెడ్డి నగర్ SHO శ్రీనివాస్ రెడ్డి రౌడీ షీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ సమయంలో ఎలాంటి అసాంఘిక పనులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీ షీట్లకు హెచ్చరించామన్నారు. అందరూ చట్టానికి లోబడి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు మధుసూదన్, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.






