3 March, 2026 | 10:57 AM

నేటి నుంచి శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

03-03-2026 12:36 AM
  1. కాశీ పట్టణానికి వెళ్లి దర్శనం చేసుకున్నంత పుణ్యం

హోలీ పౌర్ణమి నుండి శ్రీరామనవామి 

30 రోజులు పాటు కొనసాగుతున్న జాతర 

కోనేరు చుట్టూ 27 కల్ప వృక్షాల ప్రత్యేకత 

అడ్డకుల, మార్చి 2 : రామలింగేశ్వర బ్రహ్మోత్సవాలు తెలంగాణలోని మహబూబ్నగర్ దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం (కందూరు) గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వంటి ప్రముఖ శైవ క్షే త్రాలలో ఏటా అత్యంత వైభవంగా జరుగుతాయి.  దక్షిణకాశీగా పేరుగాంచిన శ్రీ రామ లింగేశ్వర స్వామి ఆలయంలో ఈ ప్రాం తంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మ ధ్య ఉత్సవాలు నిర్వహిస్తారు.

కందూరు రా మలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే కాశీ విశ్వరుడిని దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని భక్తులు ప్రాంతాల నుండి పక్క రా ష్ట్రాల నుండి కూడా భక్తుల నమ్మకం ఈ రా మలింగేశ్వర స్వామి ప్రాంతంలో కల్ప వృ క్షాలు 27 కోనేరు చుట్టూ ఉండడమే ఇం దుకు ప్రత్యేక కారణం. తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీ గా వెలుగుతుంది. కాశి తర్వాత కందూరు రామలింగేశ్వర స్వామి హిందువులకు అత్యంత అయిన పవిత్రమైన పుణ్య క్షేత్రం. ఈ కల్ప వృక్షాలు ఇక్కడే ఉన్నావని పూర్వం 11వ శతాబ్దాలలో పూర్వికులు చె ప్తుంది . ఈ కల్ప వృక్షాలకు ఓ ప్రత్యేకత ఉం ది.

ఈ కల్ప వృక్షాల కింద భక్తులు వంటలు చేసి అందులోనే కొంత ఇతరులకు దానం చేసి కల్ప వృక్షాల కిందే భోజనాలు చేసి ని ద్రిస్తే కోరిన కోరికలు తీరుతారని భక్తుల నమ్మకంతో వారి యొక్క అనారోగ్యం నుం చి విముక్తి కలుగుతుందని భక్తులు విశ్వాసం . భక్తులు కల్ప వృక్షానికి ముడుపులు కడితే అనుకున్న జరుగుతాయని కోరిక నెరవేరుతుందని నమ్ముతారు.

కల్ప వృక్షాలు ఉం డటమే ప్రత్యేకతకందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి కల్ప వృక్షాలు కాశి తర్వాత ఈ ప్రాంతంలోనే కొలువైనవని చరిత్ర చెబుతుంది. 11వ శతాబ్దంలో కాకతీయుల వంశానికి చెందిన పత్రవద్రుడు అక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రలో ఉంది. ఈ ఆలయం వద్ద ఓ ప్రత్యేకత ఉంది ఆలయాన్ని నిర్మించినప్పటికీ ఇక్కడ 27 కల్ప వృక్షాలు ద ర్శించుకోవడమే ప్రత్యేకత. ఆకాశంలో ఉండే 27 నక్షత్రాల కు ప్రతికారంగా కందూ రు శ్రీ రామలింగేశ్వర ఆలయం పక్కనున్న కోనేరు చెట్టు 27 కల్ప వృక్షాలు అరుదైనదిగా ఉన్నాయి.

ఈ ప్రాంతానికి వచ్చిన భక్తులు నమ్మకం విశ్వాసంతో చాలామంది ఆలయం కోనేరు చెట్టు ఉన్న కల్ప వృక్షాల ను తీసుకువెళ్లి వేరే వారి ప్రాంతంలో నాటిన అవి పెరగలేదు. ఈ ప్రాంతంలో ఆలయం వేసిన నాటి నుంచి ఇక్కడ 27 కల్ప వృక్షాలే ఉండటం అరుదైన ప్రత్యేకత భక్తులు భావిస్తారు. అందుకు కాశీకి వెళ్లిన కందుర్ వెళ్లిన కాశీకి వెళ్ళినంత పుణ్యం వస్తుందని భక్తులు నమ్మకం విశ్వసించి ఆలయంలో ప్రతి సంవత్సరం చుట్టుపక్కల నుంచి భక్తులు వేలా దిమంది దర్శించుకుంటారు.

కందూరు సమీపంలో గుట్టపై పూర్వము శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉండేది గుట్టపై కొలువైన రామలింగేశ్వరుడిని తాంబళి వంశానికి చెందిన మహిళ రోజు గుట్ట పైకి ఎక్కి దర్శించుకునేది. ఆమె గర్భిణీ కావడంతో రోజు గుట్ట ఎక్కడ ఆమె వల్ల కాలేదు. ప్రతిరోజు గుట్ట వెక్కి మిమ్మల్ని దర్శించుకోవడం నా వల్ల కాదు. మళ్లీ ఎప్పుడు దర్శించుకుంటాను ఏమో అని తో మొరపెట్టుకుంది.

వెంటనే ప్రత్యక్షమైన రామలింగేశ్వర స్వామి నీవు రా లేకుంటే నేనే నీ వెంట వస్తాను. నువ్వు గుట్ట దిగి ఎనకకు చూడకు వెళ్ళమని ఆమెతో చెప్పడంతో ఆమె గుట్ట దిగడం ఆరంభించిం ది. రథంపై రామలింగేశ్వర స్వామి గుట్ట దిగుతున్న సమయంలో రథచక్రాలు గంటలు శబ్దాలకు వినికిడితో ఆమె భయంతో వెనక్కి తిరిగి చూసింది.

దీనితో రథచక్రాలు విరిగి ఒకటి కోనేరు పడింది. రెండోది లింగ కృతి దాచిన రామలింగేశ్వరుని పీఠముగా ఏర్పడింది ఆలయం చరిత్ర చెబుతుంది. మహిళా  శిల్ప రూపాంతరం చెందింది. ఆమె శిలా విగ్రహం నేటి నుంచి గర్భగుడిలో ఉంది. ప్రస్తుతం స్వామివారికి పనపట్టం లేదు. రథచక్రం పనపట్టంగా మారడమే క్షేత్ర మహిళాగా పిలుస్తారు.