8 March, 2026 | 5:24 AM

ఘనంగా శ్రీసాయి బ్లూమింగ్ కిడ్స్ వార్షికోత్సవం

08-03-2026 12:00 AM

సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించిన పాఠశాల విద్యార్థులు

హైదరాబాద్, మార్చి 7(విజయక్రాంతి) : శ్రీసాయి బ్లూమింగ్ కిడ్స్ పాఠశాల వార్షికోత్సవం శనివారం రవీంద్రభారతిలో ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు పాటలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రద ర్శనలతో తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజ మాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహిస్తూ వారి ప్రతిభను అభినందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా ఎన్‌బీ సుబేదార్ నరసింహరావు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోచ్ వరలక్ష్మి విచ్చేశారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కా ర్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా, విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన త ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం శ్రీధర్, సరితలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.