calender_icon.png 4 June, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్నను దర్శించుకున్న రాష్ట్ర దేవాలయ శాఖ కమిషనర్

02-06-2025 06:40:58 PM

ఎస్. వెంకట్రావు ఐఏఎస్..

వేములవాడ (విజయక్రాంతి): దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్. వెంకట్రావు ఐఏఎస్(Endowments Commissioner Venkat Rao IAS) కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారి కళ్యాణ మండపములో ఆలయ అర్చకులు కమిషనర్ దంపతులకు వేదోక్త ఆశీర్వాదం అందించగా, అనంతరం ఈవో కే. వినోద్ శేష వస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. వారి వెంట ఆలయ సిబ్బంది ఉన్నారు.