02-06-2025 06:37:51 PM
తెలంగాణ చౌక్ జాతీయ జెండాను ఆవిష్కరించిన చల్మెడ..
ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
వేములవాడ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన భారత రాష్ట్ర సమితి పార్టీ అని, ఆనాడు కేసిఆర్ కొట్లాడి తీసుకువచ్చిన స్వరాష్ట్రంలో వారి పదేళ్ల పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ(Telangana State Formation Day) వేడుకలను తెలంగాణ చౌక్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు(Chalmeda Lakshmi Narasimha Rao) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రదాత & తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, స్వరాష్ట్రం వస్తేనే మన బ్రతుకులు ఉంటాయని వారు భావించి 2001లో పార్టీ స్థాపించి సుదీర్ఘకాలంగా 13 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్నికేసిఆర్ తీసుకవచ్చారన్నారు.
ప్రతి సంవత్సరం జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటామన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలన తర్వాత అబద్దాల హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి వారిపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. ప్రజలు మేము మోసపోయామని మళ్లీ ఎన్నికలు వస్తే తెలంగాణ తీసుకువచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, సెస్ డైరెక్టర్ హరి చరణ్ రావు, మాజీ కౌన్సిలర్లు నిమ్మిశెట్టి విజయ్, సిరిగిరి చందు, నాయకులు నీలం శేఖర్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, ఈర్లపల్లి రాజు, అంజద్ పాషా, చేపూరి రవీందర్, మాడిశెట్టి కృపాల్, వెంకట్ రెడ్డి, వాసాల శ్రీనివాస్, మల్లేశం, మండల అధ్యక్షులు గోస్కుల రవి, నాయకులు మ్యాకల రవి, ఆర్ సి రావు, గడ్డం హనుమాన్లు, నాయకులు సుంకపాక రాజు, సత్యం, పోతూ అనిల్ కుమార్, సందీప్, మధు, దేవరాజు, హరీష్, రాకేష్, దిలీప్, సాయి, ఫెరోజ్, అసద్, ఉమర్, రఫీ, మాజీ సర్పంచులు సుమన్, శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు తదితరులు ఉన్నారు.