03-06-2025 12:00:00 AM
మంచిర్యాల, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ 11వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం లో సోమవారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ జాతీయ జెండా ఎగరవేసి తెలంగా ణ అమరవీరులకు, తెలంగాణ చిన్నమ్మ సుస్మాస్వరాజ్కి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ తన స్వలాభం కోసం కేవలం ఎన్నికల్లో గెలవడానికి ఆరు గ్యారెంటీలు 66 అబద్ధపు హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, ఎన్నికల్లో గెలిచి 18 నెలలు అయినప్పటికీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వం అప్పుల్లో ఉందనీ, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పైసా లేదనడం మోసపూరిత చర్య అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన హామీలను వెంటనే అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మున్నారాజా సిసోడియా, పురుషోత్తం జాజు, గోలి రాము, పట్టి వెంకటకృష్ణ, తుల ఆంజనేయులు, అమిరిశెట్టి రాజ్కుమార్, పానుగంటి మధు, తిరుపతి, జీవీ ఆనంద్ కృష్ణ, ముదాం మల్లేష్, జోగుల శ్రీదేవి, బోయిని హరి కృష్ణ, నాగుల రాజన్న, రెడ్డిమల్ల అశోక్, కుర్రె చక్రి, కాశెట్టి నాగేశ్వర్ రావు, కర్రె లచ్చన్న, గుర్రాల లావణ్య తదితరులు పాల్గొన్నారు.