calender_icon.png 4 June, 2025 | 3:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాథ విద్యార్థులను అన్ని రకాలుగా ఆదుకుంటా..

02-06-2025 10:45:41 PM

విజయ డెయిరీ చైర్మన్ అమిత్ రెడ్డి..

అనాథ విద్యార్థి గృహం విద్యార్థులకు.. 

ఏడాది పొడవునా విజయ డెయిరీ పాలు ఇస్తాం..

ఎల్బీనగర్: తెలంగాణ రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య(విజయ డైరీ) అధ్వర్యంలో ప్రపంచ పాల దినోత్సవ వేడుకలు ఎల్బీనగర్ లోని అనాధ విద్యార్థి గృహంలో జరిగాయి. ఈ సందర్భంగా డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి(Dairy Chairman Gutha Amith Reddy) మాట్లాడుతూ... అనాథ గృహం విద్యార్థులకు ప్రతి రోజూ 12 లీటర్ల విజయ పాలను ఒక సంవత్సరం వరకు ఉచితంగా ఇస్తామన్నారు. ఇందులో భాగంగా విజయ పాలను అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేష్ సమక్షంలో విద్యార్థులకు అందజేశారు.

విజయ పాల ఉత్పత్తులను సైతం విద్యార్థులకు అందచేశారు. అనాథ విద్యార్థి గృహం ఒక అద్భుత ఆశ్రమమని, ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి బంగారు భవిష్యత్తు కల్పిస్తున్నారని అభినందించారు. పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలని అందుకే మా వంతుగా విజయ పాలు, లస్సీ, స్వీట్లను ప్రతి రోజూ విద్యార్థులకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో గృహ చైర్మన్ శశిమోహన్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, విజయ డెయిరీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జనరల్ మేనేజర్లు మధుసూదన్ రావు, మల్లికార్జునరావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.