02-06-2025 10:42:46 PM
ఎల్బీనగర్: జీహెచ్ఎంసీ జోనల్ ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు(Telangana State Formation Day) ఘనంగా నిర్వహించారు. సర్కిల్ కార్యాలయ ఆవరణలో హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య(Deputy Commissioner Dr. Thipparthi Yadaiah) జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సేవా ఇస్లావత్, సుజాత, సరూర్ నగర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్తిక్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఖదీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (SWM) నీలిమ, చందన, హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్ సర్కిళ్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.