యాదాద్రీశుడి సేవలో రాష్ట్ర ప్రభుత్వ సీఎస్
26-06-2024 12:05 AM
యాదాద్రి భువనగిరి,జూన్ 25 (విజయక్రాంతి): యాదాద్రి లక్ష్మీనృసింహ స్వామిని మంగళవారం రాష్ట్రప్రభుత్వ సీఎస్ శాంతకుమారి దర్శించుకున్నారు. ఆలయ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం ఆలయ అర్చకుల నుం చి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈవో భాస్కర్రావు, ఆలయ అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు, స్వామివారి జ్ఞాపిక అందజేశారు.






