22-01-2026 12:57:24 AM
నల్లగొండ టౌన్, జనవరి 21 : సైబర్ నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడంలో ఉత్తమ సేవలు అందించిన నల్లగొండ జిల్లా సైబర్ వారియర్స్కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది. జిల్లా పోలీస్ శాఖకు చెందిన సైబర్ వారియర్ పోలీస్ కానిస్టేబుళ్లు కె. సత్యనారాయణ (1 టౌన్ పోలీస్ స్టేషన్), ఆర్. శ్రీనివాస్ (2 టౌన్ పోలీస్ స్టేషన్) లు తమ ప్రతిభకు గాను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి,నుండి ప్రశంసా పత్రాలు, బహుమతులు పొందిన వారిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ బుధవారం తన కార్యాలయంలో అభినందించారు.
సైబర్ నేరాల నియంత్రణలో మరింత చురుకుగా పనిచేస్తూ ప్రజలకు రక్షణ కల్పించాలని ఆకాంక్షించారు.సైబర్ నేరాల నియంత్రణలో నల్లగొండ జిల్లా పోలీసుల కృషికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడం ప్రశంసనీయమన్నారు . పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు, సాంకేతిక చర్యలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్,డిఎస్పి లక్ష్మీనారాయణ, టూ టౌన్ సీఐ రాఘవరావు, వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఎస్ఐ సైదులు తదితరున్నారు.