03-06-2025 12:00:00 AM
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి అర్బన్, జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా నిర్వహిం చారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభు త్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీలు, కార్మి క సంఘాల కార్యాలయాలపై మువ్వన్నెల జెండా రెపరెపలాoది. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మున్సిపల్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ జెండా ఆవిష్కరించారు.
కాంగ్రె స్ పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర అవతరణ సందర్భంగా కేక్కట్ చేసి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బెల్లంపల్లి సివిల్ కోర్టు వద్ద న్యాయమూర్తి జితేందర్, బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయంలో ఏసీపీ రవికుమార్, ఆర్డీవో కార్యాలయం వద్ద ఆర్డీవో హరికృష్ణ, తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ కృష్ణ జెండా ఆవిష్కరణ చేశారు.
టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, జిల్లా కార్యదర్శి గేల్లి జయరాం, సీనియర్ నాయకులు మత్తమరీ సూరిబాబు, చిలుముల శంకర్,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు కటకం సతీష్, న్యాయవాదులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీబీజీకేస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.