02-06-2025 08:07:08 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ అవతరణ దినోత్సవ(Telangana State Formation Day) వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంటతో పాటు హుజరాబాద్ లోని కేసీ క్యాంపులోని ఏసీపీ కార్యాలయంలో వీ మాధవి, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రమేష్ బాబు, తహశీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కే కనుకయ్య, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి ఒడితల ప్రణవ్, బీజేపీ పట్టణాధ్యక్షుడు తూర్పాటి రాజు, పట్టణంలోని గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్ లు జెండా ఆవిష్కరించారు.
అనంతరం మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణంలో స్వచ్ఛతపై ర్యాలీ నిర్వహించారు. 15వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక పారిశుద్య కార్యక్రమంలో భాగంగా పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది, పాఠశాలల ఉపాధ్యాయులు, కళాశాలల అధ్యాపకులు, పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు పాల్గొన్నారు.