26-06-2025 07:58:22 PM
నిర్మల్ (విజయక్రాంతి): విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి పరిపూర్ణ ఆరోగ్యం కోసం యోగా చేసుకోవాలని జిల్లా ఆయుష్ వైద్యాధికారి నారాయణరావు(District AYUSH Medical Officer Narayana Rao) అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ గురుకుల పాఠశాలలో మాదకద్రవ్యాల నియంత్రణపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు కావడం వల్ల కలిగే అనర్థాలను వివరించి వాటిని దూరంగా ఉంచాలని సూచించారు. మానసిక ప్రశాంతత ఆరోగ్యవంతమైన జీవితం మనిషి ఎదుగుదలకు దోహదం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ డానియల్ వైద్యురాలు సంధ్యారాణి కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.